Sidebar


Welcome to Vizag Express
ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోండి. ప్రమాదాలు నివారించండి...

16-01-2025 21:21:50

ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోండి. ప్రమాదాలు నివారించండి...

పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 16 : వాహనదార్లు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా మాసొత్సవాలు ప్రారంభోత్సవం సందర్బంగా గొడపత్రికలు,  కరపత్రాలను విడుదల చేశారు. జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవే అథారిటీ), రహదారుల మంత్రిత్వ శాఖ - రహదారులపై సురక్షిత ప్రయాణం (సడక్ సురక్ష అభియాన్)  ప్రచారం - 2025లో భాగంగా ఫిబ్రవరి 15వ తేది వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పై అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా ప్రచార సామగ్రి, కరపత్రాలు, బ్రోచర్లుతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు భద్రత అవగాహన కోసం వాలంటీర్లను గుర్తించి శిక్షణ ఇవ్వడం, వాహన డ్రైవర్లకు ఆరోగ్య తనిఖీ, కంటి పరీక్షలు నిర్వహించడం, రోడ్డు భద్రత అమలు, రోడ్డు భద్రత అవగాహన కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్ హెచ్, ఎస్ హెచ్ లలో బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దడానికి వ్యూహాన్ని సిద్ధం చేయడం, శిక్షణ పొందిన వాలంటీర్లు కళాశాల విద్యార్థులతో వాకథాన్ నిర్వహించడం, వివిధ  కార్యక్రమాలు ద్వారా రోడ్డు ప్రమాదాలకు గల వివిధ కారణాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 
            ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, జిల్లా రవాణా అధికారి  టి.దుర్గాప్రసాద్ రెడ్డి, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ 
ఎం.శశి కుమార్,  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  జి.సీతారాం, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లు జి.సత్యనారాయణ, ఎన్.రమేష్ కుమార్,  బి.కాశిరాం నాయక్,  మెడికల్ ఆఫీసర్ పి.నారాయణరావు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.