Sidebar


Welcome to Vizag Express
ఎఫ్ఆర్టీఐ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయ రిషిత

16-01-2025 21:26:49

ఎఫ్ఆర్టీఐ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయ రిషిత 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16 :
ఫోరమ్ ఫర్ ఆర్టీఐ బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా బి.విజయ రిషితను నియమించినట్లు జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ గురువారం తెలిపారు.జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గలకు మహిళా అధ్యక్షుల నియామకం చేపట్టి, జిల్లా కమిటీను ఏర్పాటు చేయాలనీ జిల్లా నూతన మహిళా అధ్యక్షురాలును చంద్రమోహన్ సూచించారు.మహిళల హక్కులు కాపాడడం కోసం ఎఫ్ఆర్టీఐ పురుషులతో సమానంగా మహిళలకు స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు.అవినీతిని అరికట్టెందుకు,ప్రజా సమస్యలను పరిష్కారం చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఎఫ్ఆర్టీఐ లో చేరాలని కోరారు.