Sidebar


Welcome to Vizag Express
గొల్లాలమ్మ తల్లి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే

16-01-2025 21:32:00

గొల్లాలమ్మ తల్లి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే 
అనపర్తి,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16: అనపర్తి మండలం రామవరంలో శ్రీ గొల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అమ్మ వారిని దర్శించుకున్నారు. గురువారం తన స్వగ్రామమైన రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు  గొల్లాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గరగ తలపై పెట్టుకొని జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.తదనంతరం పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం లో స్వామిని ఎమ్మెల్యే నల్లమిల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే వెంట పలువురు ఎన్ డి ఏ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.