Sidebar


Welcome to Vizag Express
సజ్జాపురం రిజిస్టర్ కార్యాలయం 2024 నాటికి ఆదాయం 20.77 కోట్లు!

16-01-2025 21:35:08

సజ్జాపురం రిజిస్టర్ కార్యాలయం 2024 నాటికి ఆదాయం 20.77 కోట్లు!

తణుకు, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 16:
పశ్చిమగోదావరి జిల్లా సజ్జాపురం సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ద్వారా 2024 డిసెంబర్ నాటికి 20.77 కోట్లు ఆదాయం వచ్చిందని, 61.50 శాతం లక్ష్యాన్ని  సాధించామని సబ్ రిజిస్ట్రార్ ఏ.వీ. కృష్ణంరాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ విషయమై ఏమైనా సందేహాలు ఉన్న యెడల ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ వారిని గాని, మే ఐ హెల్ప్ యు కౌంటర్ నందు సీనియర్ సహాయకులు ను గాని సంప్రదించవచ్చునని సబ్ రిజిస్ట్రార్ ఏ.వి కృష్ణంరాజు తెలిపారు.