Sidebar


Welcome to Vizag Express
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించిన కలెక్టర్

17-01-2025 19:33:50

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను ప్రారంభించిన కలెక్టర్ 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వివరాలను స్టాల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు.ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడాలని పేర్కొన్నారు.