సర్వమానవాళి సేవ భగవంతుని సేవ
అఖండ ఫౌండేషన్ చైర్మన్ విన్నకోట సురేష్
సుబ్రహ్మణ్యశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
అన్న సంతర్పణకు చేయూత
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
సర్వమానవాళి సేవ భగవంతుని సేవతో సమానమని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ అన్నారు.బాపట్ల జిల్లా, బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పెదాపులుగువారిపాలెం గ్రామంలో శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బాపట్ల అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భక్తులతో కలిసి అన్న సంతర్పణ నిర్వహించారు.ఈ సందర్బంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మీక చింతనతో ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు విన్నకోట సురేష్ కు స్వామి వారి చిత్ర పటాన్ని అందజేసి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ సభ్యులు గోపాలం లక్ష్మినారాయణ,జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి లక్ష్మి తులసి కుమారి,బాపట్ల పట్టణ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కారుమూరి ఆంజనేష్,జనసేన పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ,ఉపాధ్యక్షులు చిలకల సురేంద్ర బాబు,అంకిరెడ్డి అనూష్ కుమార్,రామారావు,గంగరాజు, రాధాకృష్ణ,తాతరపు అంకిరెడ్డి, దానయ్య తదితరులు పాల్గొన్నారు.