75 వ వార్డు అభివృద్ధికి నిధుల మంజూరు కొరకు జీవీఎంసీ అధికారులను కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
పెదగంట్యాడ- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 25,
75వ వార్డు కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి ఆదేశాల మేరకు 75వ వార్డులో అవసరమైన పనులకు వెంటనే అవసరం ఆయిన నిధులు కేటాయించి విడుదల చేయాల్సిందిగా జీవీఎంసీ అధికారులు
CE శివ ప్రసాద్,
SE గోవింద రావు
EE అప్పారావు
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి రెడ్డి ఆధ్వర్యములో తెలుగుదేశం పార్టీ నాయకులు ములకలపల్లి పెంటయ్య, మొల్లి అప్పారావు, పులి సురేష్ రెడ్డి (బాబీ), దొమ్మేటి సోము నాయుడు,కాకినాడ అప్పల రాజు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు
దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులకు ఈ సందర్భములో నాయకులు కృతజ్ఞతలు తెలియ చేశారు