25-01-2025 22:10:07
పొందూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 25, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని, ఓటర్ నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వార సరైనటువంటి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోవద్దని పొందూరు మండల ఇన్చార్జి తహశిల్దారు వెంకటేశ రామానుజులు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొందూరు ఎస్ఐ సత్యనారాయణ, ఎంపీడీవో మన్మధరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41