Sidebar


Welcome to Vizag Express
శంబర పోలమాంబ జాతరకు భారీ పోలీస్ బందో బస్తు జిల్లా ఎస్పీ

27-01-2025 19:31:17

శంబర పోలమాంబ జాతరకు భారీ పోలీస్ బందో బస్తు  జిల్లా ఎస్పీ 

పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27:


పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంబర గ్రామంలో  తేది  27,28,29న మూడు రోజులపాటు అంగరంగ వైబవంగా జరగబోయే  ఉత్తరాంద్ర ఆరాధ్య దేవత, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా,గిరిజన దేవతగా  పేరు గాంచిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా శంబర గ్రామంను  సందర్శించి శంబర గ్రామంలో జరుగుతున్న బందోబస్ట్ ఏర్పాట్లు,బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రతీ పాయింట్ను జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ స్వయంగా పర్యవేక్షించారు.
 సిరిమాను తిరిగే ప్రాంతాలను, ఆలయం పరిసర ప్రాంతాలు, అలాగే క్యు లైన్లు , బారికేడ్స్ ఏర్పాట్లును, పార్కింగ్  స్తలాలు, ట్రాఫిక్ మోనటరింగ్ తదిర ఏర్పాట్లును జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు సందర్శించారు. సిరిమాను, పూజారి తరలింపులో ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో బందోబస్తు నిర్వహించే అధికారులు,సిబ్బంది విధులు గురించి అడిగి తెలుసుకొని పరిశిలించి అధికార్లూకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యే అధికారులు,సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి దర్శనం కోసం ఆలయం వెనుక భాగం నుండి ఎవ్వరినీ, ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. 

ప్రదానంగా సిరిమాను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మరియు ఓడిస్సా రాష్టాల నుండి బక్తులు వచ్చే ఆస్కారం ఉన్నందున, బక్తులు తాకిడి ఎక్కువ అయ్యే సమయంలో బందోబస్ట్ ను సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సిరిమాను తిరిగే రూట్ మోత్తంను తిరిగి పరిశిలించి ఎటువంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా అదేసమయంలో బక్త్తులుకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సిరిమాను జాతరను  నడిపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.  
ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా అదనపు ఎస్పీ డా ఓ. దిలీప్ కిరణ్ ,పార్వతీపురం ఏ ఎస్ పి అంకిత సురాన,, ఏఆర్ డీ ఎస్పీ థామస్ రెడ్డి, ఏ ఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బి సిఐ రంగనాధం, సాలూరు రూరల్ సర్కిల్ సిఐ రామకృష్ణ మరియు పలువురు సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ 
పార్వతీపురం .