Sidebar


Welcome to Vizag Express
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అదనపు కార్యవర్గ సభ్యునిగా నారాయణరావు

27-01-2025 20:34:56

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అదనపు కార్యవర్గ సభ్యునిగా నారాయణరావు:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 27 : పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వెలగా నారాయణరావును ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అదనపు కార్యవర్గ సభ్యునిగా నియమించారు. ఈ మేరకు ఆర్యవైశ్య రాష్ట్ర కమిటీ మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ  అందజేసిన నియామక పత్రాన్ని, అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మధు వెలగ నారాయణరావుకు అందజేశారు.ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ ఆర్యవైస్యుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్యవైశ్య సంఘాల పురోభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.