Sidebar


Welcome to Vizag Express
పలిశెట్టి రామారావుకు ఉత్తమ పురస్కారం ప్రదానం

27-01-2025 21:00:02

పలిశెట్టి రామారావుకు ఉత్తమ పురస్కారం ప్రదానం     

 గాజువాక,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27: 

ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం హాట్ లైన్ లో ఎ.ఎల్.ఎం గా పనిచేస్తున్న పలిశెట్టి రామారావుకు విశాఖపట్నం విభాగం చీఫ్ ఇంజనీర్ బి.శ్యామ్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి.ప్రభాకరరావు, ఎస్.శివరామకృష్ణ,వేణునాగుబాబు ఆదివారం ఆ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ సందర్బంగా యోగ్యతా పత్రాన్ని అందజేశారు.గ్రహీత 32 ఏళ్ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ విధి నిర్వహణలో సెహభాష్ అనిపించుకున్నారు.ఈ సందర్భంగా రామారావును తోటి ఉద్యోగులు,మిత్ర బృందం ప్రశంసలతో ముంచెత్తారు.