Sidebar


Welcome to Vizag Express
పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం .రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు

27-01-2025 21:08:36

పర్యాటక అభివృద్ధికి కొన్ని సడలింపులు అవసరం
.రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; రాష్ట్రంలో టూరిజంను అనుకున్న స్థాయిలో డెవలప్ చేయకపోవడం విచారకరమనీ  రాష్ట్ర సభాపతి అయ్యన్నపాత్రుడుఅన్నారు.  వినోదరంగంలో ఉన్న నిబంధనలు తొలగించేందుకు ప్రయత్నించాలని,  వనరులు సరిగా వాడుకుంటే పర్యాటకంగా ఏపీకి మంచిపేరు వస్తుందని సూచించారు.  పర్యాటకశాఖలో పెట్టుబడులు పెట్టేవారికి ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు.  రాష్ట్రంలో విశాఖపట్టణం చాలా కీలకమైన ప్రదేశం అన్నారు. ఇక్కడ అనేక సైట్ సీయింట్ స్పాట్లున్నాయన్నారు. గోవాకన్నా విశాఖనే బెటర్ అని తాము భావిస్తున్నామన్నారు. నర్సీపట్నం సమీపంలో లమ్మసింగికి వేలాదిగా పర్యాటకులు వస్తున్నారని, కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయం అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన గెస్ట్ హౌస్  6 ఏళ్లు అయినా  పూర్తి చేయలేదన్నారు. బాత్ రూమ్స్, టాయిలెట్స్, కనీసం వసతి సౌకర్యాలు, రెస్టారెంట్లు లేవన్నారు. లమ్మసింగి లాంటి ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించాలని మంత్రి దుర్గేష్ ను కోరారు. పాడేరు అమ్మవారి దేవాలయాన్ని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పార్కును, పురాతన బొజ్జన్నకొండను మరింత వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్మనీ మాదిరిగా విశాఖలోని ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు చిన్న చిన్న హట్స్ వేయాలని కోరారు. 1(17) చట్ట ప్రకారం ట్రైబల్ ఏరియాలో ఇన్వెస్ట్ మెంట్స్ ట్రైబల్సే చేయాలి... కానీ అంత ఇన్వెస్ట్ మెంట్ ట్రైబల్స్ చేయగలరా అని ప్రశ్నించారు. సడలింపులు ఇస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారన్నారు. యాక్ట్ లో మార్పులు తీసుకురావాల్సి వస్తే అధికారులు సంబంధిత చట్టంపై అధ్యయనం చేయాలన్నారు. యారాడ సమీపంలో అద్భుతమైన బీచ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ రిసార్ట్స్ లు కట్టాలని తెలిపారు. ఇన్వెస్టర్లకు సకాలంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్లు, ఏపీటీడీసీ అధికారులను ఆదేశించారు. విశాఖ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. స్థానికంగా టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలన్నారు. 

రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ లు  పర్యాటక శాఖ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్నారన్నారు. వారి ఆలోచనలతో ఇప్పటికే విజయవాడలో ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించామని, ప్రస్తుతం రెండో సమ్మిట్ నేడు విశాఖలో నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అన్నారు. అత్యధిక దేశాలు ఆదాయార్జన కోసం టూరిజం రంగం పైనే ఆధారపడి ఉన్నాయని వివరించారు. వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా దేశాలు అత్యధిక జీడీపీతో పాటు ఉపాధి అవకాశాలను టూరిజం రంగం ద్వారా అందిస్తున్నాయన్నారు. పర్యాటక రంగం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ చురుకుగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్లకు ఈ సందర్భంగా అజయ్ జైన్ ధన్యవాదాలు తెలిపారు. 

ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో పర్యాటక రంగం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం సీఎం తపన పడుతున్నారన్నారు. నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోనే పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 
విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక  పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

   విశాఖలో బుద్దిస్ట్ టూరిజానికి ప్రతీకగా నిలిచే తొట్లకొండ, బొజ్జనకొండ, పావురాల కొండ, బావి కొండ తదితర ప్రదేశాలున్నాయన్నారు. ఉత్తరాంద్రలో సింహాచలం, శ్రీకూర్మం, అరసవిల్లి లాంటి ప్రఖ్యాత ప్రదేశాలున్నాయని తెలిపారు. ప్రసాద్ స్కీం ద్వారా సింహాచలంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీచ్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  క్యారవాన్ టూరిజం అంశాలను ప్రస్తావించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్  మాట్లాడుతూ రాష్ట్రంలో అల్లూరి జిల్లా రెండవ అతిపెద్దదని, 73 శాతం అటవీ, పచ్చని ప్రకృతిలో అలారారే ఈ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అరకు మొదలుకొని లమ్మసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలున్నాయన్నారు. వాటన్నింటిని సర్క్యూట్ గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ వైజాగ్, అరకు పర్యాటకుల గమ్యస్థానాలన్నారు. 
టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ ఇటీవలే తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా టూరిజం పాలసీ -2025-29 పై ఇన్వెస్టర్లకు ప్రజెంటేషన్ ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. టెంపుల్ టూరిజమే కాకుండా విభిన్న టూరిజం ప్రక్రియలను ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న టూరిజం సర్క్యూట్ లపై వివరించారు.