Sidebar


Welcome to Vizag Express
నెమాలం జడ్పీహెచ్ పాఠశాలలో ఎఫ్ఎ 3పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ

28-01-2025 18:22:25

నెమాలం జడ్పీహెచ్  పాఠశాలలో ఎఫ్ఎ 3పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ 

తెర్లాం వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 28:-తెర్లాం మండలం నెమలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎంఈఓ త్రినాధరావు సందర్శించారు.మొదటగా యఫ్ ఏ 3 పరీక్షలు నిర్వహిస్తున్న ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైం టేబుల్ ప్రకారం మండలంలో 67 ప్రభుత్వ పాఠశాలాలు,7 ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్గదర్శకాలు ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పాఠశాల సిబ్బందికుఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు