Sidebar


Welcome to Vizag Express
రేగిడి మండలంలో ప్రతిభా అవార్డులు పంట

28-01-2025 18:30:12

రేగిడి మండలంలో ప్రతిభా అవార్డులు పంట
రేగిడి జనవరి 28 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ 
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిభ కనబర్చిన రేగిడి మండలం తాసిల్దార్ ఎం చిన్నారావు, మరియు ఉపాధి హామీ పథకం ఎ.పీ.ఓ సంకాబత్తుల హరినాధ్ కు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం విభాగం నుండి ఏ.ఈ.గా పనిచేస్తున్న జి. చరణ్ కు 108 విభాగం నుండి ఈ ఎం టి గా పనిచేస్తున్న మీసాల ఈశ్వర్ రావు కు ప్రతిభా పురస్కారం లభించింది.ఈమేరకు  విజయనగరం జిల్లా కలెక్టర్ డా, బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా  ప్రతిభా పురస్కార అవార్డులు మరియు సేవా ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ ,ఏపీవో , ఏఈ,108 ఈశ్వరరావు మాట్లాడుతూ, మా ఉద్యోగంలో బాధ్యతగా పనిచేసినందుకు,ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ అవార్డు రావడం వలన ఉద్యోగ విధులపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు, ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఆయా శాఖల అధికారులు వీరందరిని అభినందించారు మరియు రేగిడిఆమదాలవలస మండలం అభివృద్ధి అధికారి శ్యామల కుమారి మరియు  అధికారులు వీరు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు