Sidebar


Welcome to Vizag Express
పొలం పిలుస్తుంది కార్యక్రమం

29-01-2025 22:25:19

పొలం పిలుస్తుంది  కార్యక్రమం 

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29

 రణస్థలం మండలం లో రణస్థలం పంచాయతీ లో వ్యవసాయశాఖ పొలంపిలుస్తుంది అనే కార్యక్రమం ని ప్రజాప్రతినిధులు సమక్షంలో నిర్వహించడం జరిగింది రైతులు కి ఆధునిక సాంకేతికతని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విషయ పరిజ్ఞానం ని రైతులు కి అందించడం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని వ్యవసాయఅధికారి విజయభాస్కర్  వివరించడం జరిగింది ప్రస్తుతం ఉన్న వాతావరణం దృష్ట్యా మొక్కజొన్నలో తెగులు మరియు పురుగు ఉదృతి ఎక్కువ గా ఉంటుంది ,కనుక వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు పురుగు మందులు వినియోగించు కోవాలని తెలియపరిచారు ఈ కార్యక్రమం లో పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు , గ్రామ వ్యవసాయ సహాయకులు ,గ్రామ రైతులు పాల్గొన్నారు