Sidebar


Welcome to Vizag Express
68 మంది కు కంటి వైద్య పరీక్షలు

04-02-2025 21:35:02

68 మంది కు కంటి వైద్య పరీక్షలు 

9 మందికు శస్త్ర చికిత్సకు విశాఖపట్నం తరలింపు 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,04: మండల కేంద్రం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సిహెచ్ సి లో ఆప్తల్మిక్ అసిస్టెంట్, కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని పి శిరీష ఏవో కిషోర్ కుమార్ లు శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్తల్మిక్ అసిస్టెంట్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ కంటి సంబంధిత బాధతో బాధపడుతున్న 68 మందిని వైద్య పరీక్షలు నిర్వహించగా నిర్వహించమన్నారు. 9 మంది కి కంటి చూపు సరిగ్గా లేనందున శస్త్ర చికిత్స చేయించుట అవసరం ఉందన్నారు. 9 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం అనిల్ నీరుకొండ ఆసుపత్రి తగరపువలస విశాఖపట్నం కి ప్రత్యేక మినీ బస్సు ఏర్పాటుచేసి తరలించమన్నారు. శాస్త్ర చికిత్స పూర్తయిన నిమిత్తం అదే నీరుకొండ ఆసుపత్రి మినీ బస్సులో ముంచింగిపుట్టు మండల కేంద్రానికి తీసుకుని వస్తామని ఆయన తెలిపారు