Sidebar


Welcome to Vizag Express
విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించిన పొందూరు ఎంఈఓ.

04-02-2025 22:05:10

వైజాగ్ ఎక్స్ ప్రెస్, పొందూరు ఫిబ్రవరి 4 : విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించిన పొందూరు ఎంఈఓ.             పొందూరు మండల పరిధిలో దేవాంగుల కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను ఎంఈఓ జి .శ్రీరాములు మంగళవారం పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. నిత్య విద్యార్థిగా ఉండి బోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణారావు ,వాగ్దేవి, రఘుబాబు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు