వివిధ గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
రేగిడి ఫిబ్రవరి 5 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాలవలస చినశిర్లం,పెద్దశిర్లం,సోమరాజుపేట ,గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారి జి. మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు,
పెసర,మినుము, మొక్కజొన్న పంటలు యాజమాన్య పద్ధతులు గురించి మరియు ప్రధాన మంత్రి కిసాన్ సమాన్ నిధి కోసం రైతులు ఈ కే వై జీ చేసుకోవాలి. పొలం నీరు కోసం నీటి పైపులు రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయి కావున రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తుంపర మరియు బిందూ సేద్యం పరికరాలకు ప్రభుత్వం రాయితీ ఉంది కనుక రైతులు ఈ రాయితీని వినియోగించుకోవాలని అన్నారు.