Sidebar


Welcome to Vizag Express
ఎన్ఆర్ఈజీఎస్ పనులు పరిశీలన

05-02-2025 19:36:29

ఎన్ఆర్ఈజీఎస్ పనులు పరిశీలన

 వీరఘట్టం, వైజాగ్ ఎక్స్ప్రెస్,

 ఫిబ్రవరి 5 :

              వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామపంచాయతీ నందు జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీవో బి. వెంకటరమణ పరిశీలన చేశారు. ప్రభుత్వము నిర్దేశించిన కొలతలు ప్రకారము పనిచేయాలని అలా చేసినట్లయితే గరిష్ట వేతనం 300 రూపాయలు పొందుటకు అర్హులు అవుతారని వేతనదారులకు  అవగాహన కల్పించారు. మెట్లు తమ గ్రూపులో ఉన్న సభ్యులను పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని వారికి ఎంపీడీవో ఆదేశాలు  జారీ చేశారు.