Sidebar


Welcome to Vizag Express
సచివాలయాలను సందర్శించిన ఎంపీడీవో

05-02-2025 20:01:33

సచివాలయాలను సందర్శించిన ఎంపీడీవో 

కంచిలి వైజాగ్ ఎక్స్  ప్రెస్ ఫిబ్రవరి 5:

 మండలములో గల భోగాబెని మరియు కంచిలి-1 సచివాలయాలను వి.తిరుమల రావు, యం.పి.డి. ఓ.  సందర్శించి సచివాలయాల రికార్డులను పరిశీలించారు. డిజిటల్ అసిస్టెంట్లు యొక్క లాగిన్ నందు నమోదు చేసిన సేవల యొక్క రుసుమును ఎప్పటికప్పుడు చలానా తీసి ప్రభుత్వ ఖాతా యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్నకు జమ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఎన్ని రాంబాబు, సచివాలయం ఉద్యోగులు  జీవనజ్యోతి, రమ్యకృష్ణ పాల్గొన్నారు.