గ్రామ పంచాయతీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
06-02-2025 20:59:25
చీపురుపల్లి రూరల్/గుర్ల, వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 6: గుర్ల మండలం, కలవచర్ల గ్రామ పంచాయతీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఓ.సీ.ఎల్) డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయి కిషోర్ టీమ్ ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా హాజరైన తహశీల్ధార్ వి.నారాయణమ్మ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పారదీప్ - హైదరాబాద్ పైప్ లైన్ గుర్ల మండలంలో 25 కిలోమీటర్లు పొడుగునా పోతుందన్నారు. ఈ పైప్ లైన్ ద్వారా పెట్రోల్, డీజిల్, ఏ. టి. ఎఫ్ ఆయిల్స్ ను రవాణా జరుగుతోందన్నారు. అలాగే విపత్తులు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని చూచించారు. అంతకుముందు అరగంట పాటు ఐ. ఓ. సీ. ఎల్ అధికారులు వారి సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించి కళ్ళకద్దినట్టు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పైప్ లైన్ వెళ్లే మార్గంలో ఒకవేళ పైప్ లైన్ లీకేజీ సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం కూడా అందజేయడం జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అలాగే పైప్ లైన్ వెళ్లే మార్గంలో భూమిపైన పైప్ లైన్ లీకేజీ కి తలెత్తే అవాంఛనీయ కార్యకలాపాలైన బావులు తవ్వడం, బోర్లు తవ్వించడం, పంటలు పూర్తయ్యాక మంటలు పెట్టడం, దృఢమైన వృక్షాలు నాట్టడం లాంటివి చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యడ్ల గోపీనాయుడు, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు నీలిరోతు అప్పారావు,బెవర కూర్మారావు, చీపురుపల్లి ఫైర్ ఆఫీసర్ హేమసుందర్, పీ హెచ్ సీ వైద్యాధికారి డా. శ్రీధర్, ఐ ఓ సీ ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయి కిషోర్,ఆపరేషనల్ ఎండ్ మైంటైనెన్స్ మేనేజర్, మెయిన్ లైన్ ఆఫీసర్ లక్ష్మి నారాయణరెడ్డి, పి. గణేష్ బాబులతో పాటు ఐ. ఓ. సీ. ఎల్ సిబ్బంది, పలువురు రైతులు, గ్రామస్థులు పాల్గొన్నా