Sidebar


Welcome to Vizag Express
అగనంపూడి జగన్నాథ స్వామి రధానికి రక్షణ

06-02-2025 21:16:40

అగనంపూడి జగన్నాథ స్వామి రధానికి రక్షణ                గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్,  ఫిబ్రవరి 6,                     శతాబ్దం తరవాత అగనంపూడి జగన్మాధస్వామి రథానికి నీడ కల్పిస్తున్న ఎమ్మెల్యే కి కార్పొరేట్ కి ధన్యవాదాలు
      ప్రతిష్టాకరమైన శ్రీ జగన్నాథ స్వామి ఆలయము శతాబ్దం పైబడి అగనంపూడి లో వెలిచి యున్నది. జగన్నాథ స్వామి ఉత్సవాలకు ఉపయోగించే రధము అగనంపూడి సెంటర్లో ఉండేది ఆ రధము ఎంతో కాలము నుండి ఎండకు వర్షాలకి తడుస్తూ ఉండేది కొంతకాలం తర్వాత తాటి ఆకులతో పాక వేయడం చేసేవారు 79 వ వార్డు కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఆలయ ధర్మాదాయ దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వెళ్లి ఆయన చే ప్రభుత్వ అధికారులకు సిఫార్చేసి ఎట్టికేలకు జగన్నాథ స్వామి రథం కు ఎండకు వానకు రక్షణ కల్పించే చర్యలో భాగంగా షెడ్డు నిర్మాణం చేపిస్తున్నారు. సదరు పనులను జగన్నాథ స్వామి ఉత్సవాల కమిటీ చైర్మన్ కరణం పైడిరాజు ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ జీవీఎంసీ 85 వ వార్డు టిడిపి ఇన్చార్జ్ గంతకోరు అప్పారావు 85వ వార్డు తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్ షెడ్డు నిర్మాణ పనులను సందర్శించి స్థానిక ప్రజలు భక్తుల తరఫున పల్లా శ్రీనివాసరావు కి రౌతు శ్రీనివాసరావుకి ఆలయ ఈవో కి ధన్యవాదాలు తెలియజేశారు.