విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి నిర్ణయించిన కేంద్రం
గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 6,
వాల్తేర్ డివిజన్నుత విశాఖ డివిజన్గార పేరు మార్పు
410 కిలోమీటర్ల పరిధిలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్
కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలో తీసుకున్న కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు
వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పాటుగా వాల్తేర్ డివిజన్ను విశాఖ డివిజన్గా పేరు మార్చి, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తాం. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా తొలగించడం సరికాదంటూ కూటమి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కీలక ముందడుగు. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం, విశాఖ రైల్వే అభివృద్ధిలో చారిత్రాత్మకమైన ముందడుగుగా నిలిచిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన రైలు సేవలు అందించడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఇది మరింత ఊతమిస్తుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రైల్వే కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం లభించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్లు కేంద్రం నుంచి సాధించడంతో పాటు కేంద్ర బడ్జెట్లో క్యాపిటల్ షేర్ కింద మరో రూ.3,295 కోట్లు కేటయించారు. దేశ ప్రధానే విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రం మరింత ప్రగతి సాధించేందుకు టీడీపీ కృషి కొనసాగిస్తుంది. కేంద్రంతో సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉంటాం.