Sidebar


Welcome to Vizag Express
రైతు ఉత్పత్తిదారుల శీతలగిడ్డంగి సందర్శన

06-02-2025 21:31:01

రైతు ఉత్పత్తిదారుల శీతలగిడ్డంగి సందర్శన 

వీరఘట్టం, వైజాగ్ ఎక్స్ ప్రెస్

 ఫిబ్రవరి 6:

          మండల రైతు ఉత్పత్తి దారుల సంస్థను పార్వతీపురం జిల్లా ఉద్యాన అధికారి  బి.శ్యామల  సందర్శన చేశారు.ఎప్ పి ఓ చే నిర్మించబడిన కలెక్షన్ సెంటర్,  శీతల గిడ్డంగి  లను రైతు లు వారు పండించే పంటలను నిల్వ చేసుకుని అధిక దరలకు అమ్ముకొని లాభాలు పొందాలని సూచనలు చేశారు ప్రభుత్వం సమకూర్చిన ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తద్వారా తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఇక్కడ నేల ను బట్టి పంటలు వేసుకోవాలని ఉద్యాన పంటలకు అధిక డిమాండ్ ఉండడం చే వాటిపై దృష్టి సారించాలని రైతులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమం లో ఎఫ్ పి ఓ అధ్యక్షులు కరణం చిన్నంనాయుడు, మండల సమాఖ్య ఏపీఎం కె.రాము, పీఎంఫమ్ డి ర్ పి, వీరఘట్టం మండల ఉద్యాన అధికారి  అమరేశ్వరి, సిసి ఆనంద్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.