వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరిపించాలి
-అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం రమేష్
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 11:
వైసీపీ హాయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై విచారణ జరిపించాలని అనకాపల్లి ఎం.పీ డాక్టర్ సీఎం రమేష్
కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.మంగళవారం లోక్ సభ జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్లో 2019 వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నా.మద్యం దుకాణాల్లో వైయస్ఆర్సీపీ హయాంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగస్తులను నియమించి ఐదేళ్ల కాలంలో దాదాపు ఒక లక్ష కోట్లు అమ్మకాలు జరిగితే మొత్తం నగదు రూపంలో తీసుకున్నారని ఒక్క రూపాయి కూడా డిజిటల్ గా తీసుకోలేదు అన్నారు.ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 10 రెట్ల పెద్ద స్కామ్ అని, దాదాపు రూ.30 వేల కోట్లు స్కామ్ జరిగిందని ఆరోపించారు.వైసీపీ హయాంలో మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలోనే మాత్రమే జరిగాయని గుర్తు చేశారు.ఇన్ని కోట్ల రూపాయలు అమ్మకాలలో ఒక్కటి కూడా డిజిటల్ గా లావాదేవీ జరిగిన దాఖలాలు లేవు అని, కొన్ని వేల కోట్లు రూపాయలు దారి మళ్లించారన్నారు.