మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు బాసట
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 12:
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం ఎస్టి కాలనీకి చెందిన నరిసే శ్రీను గత నెల 27వ తారీఖున కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు దీంతో 2007 తనతో పాటు చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు మరణించిన స్నేహితుడి కుటుంబానికి అపన్న హస్తం అందించారు. తల్లిదండ్రులైన నర్సయ్య వెంకన్న చిన్న బుజ్జికి 45 వేల రూపాయలు నగదును పూర్వ విద్యార్థులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుడి స్నేహితులు పాల్గొన్నారు