30-01-2025 19:05:01
సమగ్ర శిక్ష ఏ.పి.సి.గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. రామారావు విజయనగరంటౌన్, వైజాగ్ ఎక్సప్రెస్,జనవరి 29:జిల్లా సమగ్ర శిక్ష అదనపు పధక సంచాలకులుగా డా. ఏ.రామారావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఏ.పి.సి. గా బాధ్యతలు చేపట్టిన డా.రామారావు కు జిల్లా విద్యా శాఖ అధికారి మాణిక్యం నాయుడు, విద్యా శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు. డా రామారావు ఇప్పటి వరకు పార్వతీపురం లోని ఉద్యాన కళాశాల లో అసిస్టెంట్ ప్రొఫెసరు గా చేస్తూ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.