Sidebar


Welcome to Vizag Express
మహాత్మ గాంధీ వర్ధంతి కార్యక్రమం లో పుష్పంజలి

30-01-2025 19:33:15

మహాత్మ గాంధీ వర్ధంతి కార్యక్రమం లో పుష్పంజలి

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30 


 రణస్థలం మండల కేంద్రం నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా  వారి చిత్ర పటానికి  ఎంపీడీవో ఎం ఈశ్వరరావు  పుష్పంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  అహింస మార్గం లో శాంతి సత్యాగ్రహం అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులను ఒదించగలం అన్న సత్యాన్ని ప్రపంచానికి నేర్పిన మహానుభావుడని భారత మాత ఒడిలో జన్మించిన మరో గౌతమబుద్ధుడని అన్నారు ఈ కార్యక్రమం లో ఏవో ధనుంజయ్ రావు ఈవో పి ఆర్ డి పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగస్తులు  పాల్గొన్నారు