5వ వార్డులో చంద్రబాబు జన్మదిన వేడుకలు

4/21/2023 7:27:24 AM


మధురవాడ, ఎక్స్ ప్రెస్ న్యూస్, ఏప్రిల్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు 5వ వార్డు పరిధి బొట్టవానిపాలెంలో పార్టీ కార్యాలయంలో, వై.ఎస్.ఆర్.కాలనీ, రాజీవ్ గృహకల్ప(మారికవలస)లలో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్  కాబోయే ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జి కోరాడ రాజబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిళలక్ష్మణరావు, టీడీపీ సీనియర్ నాయకులు వాండ్రాశి అప్పలరాజు హాజరై  కేక్ కటింగ్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జి కోరాడ రాజబాబు మాట్లాడుతూ....విశాఖ నుంచి పరిపాలన చేస్తాం అంటున్న జగన్ కి రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉందన్న విషయం తెలియదా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు ఒరిగిందేమిలేదని, అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలి పరిపాలిస్తున్నారని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, విద్యా వ్యవస్థ మారాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాల్సిందేనన్నారు. ఐటీని ప్రోత్సహించి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదన్నారు. సీనియర్ నాయకుడు వాండ్రాశి అప్పలరాజు మాట్లాడుతూ పరిపాలనలో దాపరికం లేకుండా పారదర్శకత తేవడానికి చంద్రబాబు కృషి అమోఘం అన్నారు. ఓటు బ్యాంకులను దృష్టిలో పెట్టుకోకుండా ధైర్యంగా సాహసోపేతంగా ముందడుగు వేశారని, చంద్రబాబు నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు రానున్నాయని అన్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను అని మొల్లి లక్ష్మణరావు అన్నారు. ఈకార్యక్రమంలో 5వ వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), కార్యదర్శి ఈగల రవి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్ (పొట్టిప్రసాద్), యువత అధ్యక్షుడు కొండపు రాజు, బొడ్డేపల్లిరంగా, బోర అప్పలసూరిబాబురెడ్డి, నూకరాజు, నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు సరస్వతి, నీలపూ జయ, ఆవాల నీలయ్య, ఆనందరావు, భాస్కర్, మన్యాల హనుమంతరావు, నాగేశ్వరరావు, చక్రపాణి, దాలిమదొర, నాగోతి అప్పలరాజు, వెంగళరావు, నూకరాజు ఎం రవి శ్రావణ్ హరికృష్ణ విజయ్, మాధవ, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*