మే 4న తిరుమల‌లో నృసింహ జయంతి

4/28/2023 7:55:30 AM

 తిరుమల, ఎక్స్ ప్రెస్ న్యూస్  ఏప్రిల్ 27: తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 4న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

వసంత మండపంలో  నరసింహస్వామి వారి పూజ
వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల‌ వరకు నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వేంకటేశ్వర భక్తి చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆల‌య ప్రాశస్త్యం :

 శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపునశమండపంలో పడమరగా యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో రామానుజాచార్యుల‌ వారు యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Name*
Email*
Comment*