2030నాటికల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్

5/23/2023 2:09:41 PM



భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు..

సోమవారం బాపట్ల జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని ఆయన వ్యవసాయ యూనివర్శిటీనిసందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న 2030కల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి సూచించిందని, ఇందులో చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచటమే ప్రధానమన్నారు. వాతావరణ మార్పులు ఇబ్బంది ఉన్నా.. చిరు ధాన్యాల సాగులో మంచి దిగుబడి వస్తుందన్నారు. చిరు ధాన్యాల్లో నూతన వంగడాలు ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మిల్లెట్ల సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. వాటిని తినడం వలన మనుషులు ఆరోగ్యకరం గా ఉంటారు..

Name*
Email*
Comment*