టీడీపీ మరో కొత్త ఫ్లెక్సీ

5/31/2023 10:31:37 AM

* ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు

మచిలీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  మచిలీపట్నంలో రాజకీయ పార్టీలు మధ్య ఫ్లెక్సీల యుద్ధం కొనసాగుతోంది. నిన్న పోటాపోటీగా జనసేన వైసీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా..
 బుధవారం టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఆసక్తిని రేపుతోంది. అయితే వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ కార్పొరేషన్ సిబ్బంది మాత్రం జన సైనికులు కట్టిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు. అదేమని ప్రశ్నించిన జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో కొత్తగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగనాసుర రక్త చరిత్ర.. బాబాయి గొడ్డలికి.. బంగారు భవిష్యత్తు కు యుద్దం అంటూ పది తలల రావణాసురుడిగా కత్తి పట్టిన జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ కాళ్ల దగ్గర బాబాయి మృతదేహం, జగన్ వెనుక భయపడుతున్న పేద ప్రజలు.. మరో‌వైపు జగన్ అనే రాక్షసుడి నుంచి కాపాడేందుకు ప్రజలకు అడ్డుగా ఉన్న చంద్రబాబు చిత్రంతో ఫ్లెక్సీలు వెలిశాయి. మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.........

Name*
Email*
Comment*