ములుగు జిల్లాలో నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

6/1/2023 1:35:21 PM

ములుగు జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్:
వాజేడు మండలంలో నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె శివప్రసాద్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు.. ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్ర నాయకులు దళ సభ్యులు ..మరికొంతమంది వాజేడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మిషన్లను తగలబెట్టి ..అటుగా వచ్చే పోలీసు పార్టీని ల్యాండ్ మెన్ ఏర్పాటు చేసి చంపాలని కుట్ర పన్నుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో  వాజేడు నుండి గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న దారిలో తనిఖీ నిర్వహించారు.. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై ఒక బస్తా బ్యాగు పెట్రోల్ టీం తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తు పోలీస్ పార్టీని చూసి పారిపోవాలని ప్రయత్నించారు.. గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా.. అందులో పేలుడు పదార్థాలు కనిపించడంతో ఇద్దరు పంచులను పిలిపించి వారి సమక్షంలో విచారణ నిర్వహించారు.. పుల్లూరి నాగరాజు వావిలాల నర్సింగరావు ఎం పెల్లి జాగావా కంబాలపల్లి గణపతి అనే నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు...

Name*
Email*
Comment*