సోంపేట ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22; చదువుతోనే మనిషి సంపూర్ణంగా వికాసం చెందుతాడని ,విధ్యార్థిని ,విద్యార్థులు ఇష్టంగా చదివి పరీక్షలలో మంచి విజయాలు పొందాలని సోంపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి మోహనరావు పేర్కొన్నారు .ప్రభుత్వ జూనియర్ కళాశాల,ఆవరణలో ఫేర్ వెల్ ఫంక్షన్ , వీడ్కోలు సభ గురువారం ఘనంగా నిర్వహించారు . ప్రిన్సిపాల్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల కంచిలి ప్రిన్సిపాల్ శ్రీమతి పి రజిని కుమారి, బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం కామేశ్వరరావు , గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం దామోదర్ రావు ,తదితరులు మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏ విధంగా సహనంతో ఎదుర్కోవాలి క్రమశిక్షణతో ఎలా ఉండాలని వివరించారు . అనంతరం వక్తలను సన్మానించారు. పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి . ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యా కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు