- ఏపీలో అత్యంత కీలక పరిణామం
- ఎన్నికల ముంగిట ఏకంగా డీజీపీపై బదిలీ వేటు
- వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశాలు
అమరావతి, ఎక్స్ప్రెస్ న్యూస్;
ఏపీలో ఎన్నికలు మరో వానం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో, ఆదివారం అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ కె.రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ... ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితాను సోమవారం ఉదయం 11 గంటల లోపు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది.