గుండెపోటుతో వైయస్సార్ సీనియర్ నాయకుడు మృతి

6/22/2024 10:12:29 PM

- శోక సంద్రంలో   మాదలింగి గ్రామస్తులు

కొమరాడ: ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్ 22:
 కొమరాడ మండల ఎం పి పి శెట్టి శ్యామల భర్త  వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు  శెట్టి మధుసూదన్ రావు డాక్టర్ శనివారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం మండలానికి తీరని లోటు. ఆయన మండలంలో ఎవరికి ఎటువంటి హాని చేయడం కానీ, సమస్యలను సృష్టించడం కానీ  చేయకుండా అందరితో స్నేహభావంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారు. అటువంటి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మృతి మండలానికి తీరనిలోటని మండల ప్రజలు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు . ఆయన ఆత్మకు శాంతి కలగాలని,అన్ని పార్టీల నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపర్చారు . ఆయన మరణ వార్త వినగానే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఎంపీపీకి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన స్వగ్రామంలో పూర్తి చేస్తారు.

Name*
Email*
Comment*