చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

7/26/2024 8:56:13 PM

మధురవాడ: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి ఆషాడ మాసం బహుళ పక్షం షష్ఠి శుక్రవారం సందర్భంగా నిత్య అర్చనలతో పూజా కార్యక్రమాలు ప్రారంబించి ప్రత్యేక కుంకుమార్చనలు, పుష్పార్చనలు తదితర  పూజా  కార్యక్రమాలు ఆలయ  అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మలు నీరాజన మంత్రపుష్పం అమ్మవారికి సమర్పించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి రోజు శుక్రవారం కావడంతో  మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా మధురవాడ కళానగర్ వాస్తవ్యులు రామకృష్ణ, రజని దంపతులు సహకారంతో ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదమును అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం వేళ శ్రీదుర్గాలమ్మ అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రత్యేకంగా అలకరణ చేసి కుంకుమార్చనలు పుష్పార్చనలు చేసి నీరాజనం మంత్రపుష్పం సమర్పించి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ  కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, ఎస్.ఎన్.మూర్తి సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్లా రమణ, పిళ్లా మోహన్ శివకృష్ణ, పిళ్లా రాజు, కేశనకుర్తి అప్పారావు, మరుపిల్లి ఆనంద్, ముఖ్య సభ్యులు పిళ్లా వెంకటరమణ, పిళ్ళా అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*