మీ సంకల్పం గొప్పది.. రిటైర్డ్ జడ్జి ప్రశంస

7/26/2024 9:50:19 PM

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్:  
మందస మండలం సొండిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు భవనాల కొరత వెంటాడటంతో పాటు ,ఉన్న వి శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షాకాలంలో మరింత దారుణంగా మారాయి. పెచ్చులూడి పడుతుండడంతో విధ్యార్థులు ,ఉపాధ్యాయ సిబ్బంది  భయాందోళనలకు  గురవుతున్న నేపథ్యంలో పాఠశాల దుస్థితి  తెలుసుకున్న  "సంకల్ప ట్రస్టు " ఏడు లక్షల రూపాయలతో ఓ తరగతి భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని రిటైర్‌ జడ్జి ఆర్‌.పుండరీకాక్షుడు  శుక్రవారం (విశాఖపట్నం) ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప ట్రస్టు సేవలు అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి మంచి  కార్యక్రమాలు చేసే సంకల్పం భగవంతుడు వీరికి కల్పించాలని కోరారు.  ప్రధానోపాధ్యాయుడు సుందర సాల్మన్‌ మాట్లాడుతూ పిల్లలకు మంచి వసతి కల్పించిన సంకల్ప ట్రస్ట్‌ వారికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప ట్రస్ట్‌ ప్రతినిధులు ఆర్‌.జగన్‌ మోహన్‌రావు, పి.నేతాజీ , సిహెచ్‌.విశ్వప్రసాద్‌, డి.వెంకటరమణ, సిహెచ్‌.కృష్ణ ప్రసాద్‌, ఇ. నారాయణ మూర్తి, కె.రమేష్‌, గ్రామపెద్దలు ఔగాన ఈశ్వరరావు, చింతాడ లక్ష్మీనారాయణ, మామిడి కల్యాణ్‌, మల్లారెడ్డి భాస్కరరావు, యానాది వాసుదేవు, మద్ది సురేష్‌, మద్ది సత్యం, మిస్క గణపతి, సీహెచ్‌ దీపక్‌, కె.రాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*