మమ్మల్ని కూడా గుర్తించండి మహాప్రభో

7/26/2024 9:55:15 PM

కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
ఇచ్చాపురం నియోజకవర్గం లో గల సుమారు 1000 కుటుంబాలు  కలిగి ఉన్న బేడ బుడగ జంగమ కులస్తులను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ద్వారా విజయవాడలో గల  అచ్చమనాయుడును మంత్రి క్యాబిన్లో కలిసి తమ కులస్తులను గుర్తించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. కంచిలి మండలం జాడపూడి కేసరపడా జక్కర సోంపేట మండలంలో కొర్లం కవిటి మండలంలో కొత్తకోజిరియా నీలాపుపుట్టుగ నెలవంక తదితరు గ్రామాల్లో నివసిస్తున్న తమ కులస్తుల పిల్లల చదువులు నిమిత్తం సర్టిఫికెట్లు మరియు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో జాప్యం జరుగుతున్న తరుణంలో ఇప్పటికైనా తమ ప్రభుత్వం మా కులస్తులను గుర్తించాలని కోరారు. మంత్రి అచ్చం నాయుడు కలిసిన మండల తెలుగుదేశం పార్టీకి చెందిన మాదిని రామారావు తమరాల వెంకటరమణ పిలక చిన్నబాబు మరియు బేడ జంగమ బుడగ కులాల పెద్దలు వైకుంఠ రావు అప్పారావు బైరాగి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.

Name*
Email*
Comment*