క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

7/26/2024 10:41:02 PM

- సమస్యలను పరిష్కరించి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
- జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్; 
సిబ్బంది ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వ్యక్తిగత ఉద్యోగరీత్యా సమస్యల పరిష్కరించి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చూపెట్టిన తొలిసారిగా శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కు జిల్లా ఎస్పీ హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా ఆర్మడ్ సిబ్బంది జిల్లా ఎస్పీ నకు వందన సమర్పించి అనంతరం పరేడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయమ్యానికి కేటాయించి మానసిక,శారీరకంగా దృఢంగా ఉండాలని అలాంటప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని తెలిపారు. సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్న దృష్టికి తీసుకురావాలని సాధ్యసాధ్యులు బట్టి సమస్యలు పరిష్కరిస్తానని భరోసా కల్పించారు.అనంతరం పలువురు సిబ్బంది వారి యొక్క వ్యక్తిగత,ఉద్యోగరీత్యా సమస్యలను తెలియపరుచుకున్నారు .ఈ పరేడ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డిఎస్పీలు ఎల్.శేషాద్రి,జి. శ్రీనివాసరావు సిఐ అవతారం, ఏ.ఆర్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*