భార‌త‌దేశంలో పుట్ట‌డం మ‌నకు గ‌ర్వ‌కార‌ణం

7/26/2024 10:47:36 PM

*కార్గిల్ అమ‌ర సైనికుల‌కు నివాళి

*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీ‌కాకుళం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
భార‌త‌మాత ముద్దుబిడ్డ‌లుగా నేటి యువ‌త ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాల‌ని, భార‌త‌దేశంలో పుట్ట‌డం మ‌నకు గ‌ర్వ‌కార‌ణం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్, సైనికులు దేశానికి అందించే సేవలను అభినందిస్తూ, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పలువురు మాజీ సైనికులు, సైనిక సంక్షేమ కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
జూలై 26 కార్గిల్ విజ‌య్ దివాస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ 25వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన ఇద్దరు మాజీ సైనికులను సన్మానం చేసి, నగదు పురస్కారాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా, ప్రత్యక్షంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అభినందించి, జిల్లాలో గల మాజీ సైనికులు మరియు వారి కుటుంబాల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారం చేస్తామని తెలిపారు.  తదుపరి కార్యక్రమంలో, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఇతర మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది, మరియు ఇతర ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసంగిస్తూ, కార్గిల్ విజయ్ దివాస్ పర్వదినం దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అన్నారు. దేశాన్ని కాపాడిన సైనికుల సేవలను గుర్తుంచుకుని సత్కరించడం మన కర్తవ్యమని వివరించారు.

Name*
Email*
Comment*