- 15 మంది ప్రజాపద్దుల కమిటీలో ముగ్గురు వీరే
విశాఖపట్నం, ఎక్స్ప్రెస్ న్యూస్;
ఏపీలో గెలిచిన 21 మంది ఎన్డీఏ ఎంపీల నుంచి ముగ్గురిని విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఓ కీలక పార్లమెంటరీ కమిటీకి గురువారం ఎంపికయ్యారు. విపక్ష నేత రాహుల్ గాంధీ ఛైర్మన్ గా లోక్ సభ 18వ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు ఎన్డీయే ఎంపీలకు చోటు దక్కింది. ఏపీలో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్క ఎంపీకి ఇందులో చోటు కల్పించారు. వీరిలో ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారు. 15 మంది సభ్యులతో ఉన్న ఈ కమిటీలో ముగ్గురు ఏపీ వారే ఉండటం విశేషం. ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం ఏపీ ఎన్డీయే ఎంపీలు కాకుండా ఈ కమిటీలో ఇంకా టీఆర్ బాలు, నిషికాంత్ దూబే, జగదంబికా పాల్, రవిశంకర్ ప్రసాద్, త్రివేంద్ర సింగ్ రావత్, ప్రొఫెసర్ సౌగత రాయ్, అపరాజితా సారంగి, డాక్టర్ అమర్ సింగ్, తేజస్వి సూర్య, అనురాగ్ ఠాకూర్, కేసీ వేణుగోపాల్, ధర్మేంద్ర యాదవ్ ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ ఉండబోతోంది. ఏప్రిల్ 30 తర్వాత మరో కమిటీ ఎన్నిక ఉంటుంది. వాస్తవానికి ఈ కమిటీలో సభ్యత్వం కోసం మరో నలుగురు ఎంపీలు కూడా పోటీ పడినా చివరి నిమిషంలో వారు తప్పుకోవడంతో ఏకగ్రీవమైంది.