తైక్వాండో పోటీలలో మధురవాడ విద్యార్థులకు పతకాలు

8/14/2024 6:17:35 PM

మధురవాడ: ఎక్స్ ప్రెస్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ఆమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన 9వ ఇంటర్ స్టేట్స్ ఇన్విటేషన్ టైక్వాండో పోటీ లలో మధురవాడ ఆనంద్ టైక్వాండో అండ్  మార్షల్ ఆర్ట్స్ క్లబ్ క్రీడాకారులు పలు పతకాలు గెలుచుకున్నారు. క్యాడెట్ [12 నుండి 14 సం] కేటగిరి 60 కేజీలు విభాగంలో పి.వెంకటేష్ బంగారు పతకం, 41 కిలోల విభాగంలో ఎస్ కె. హరీఫ్ రజత పతకం గెలుపొందగా జూనియర్ [15 నుండి 17 సం] కేటగిరి బాలుర 41 కిలోలలో ఎస్.నిఖిల్, 49 కిలోల లో పి.దుర్గా ప్రసాద్, 55  కిలోల లో ఎస్ కె. రజక్, బాలికల విభాగం 53 కిలోల లో పి.సాయి భార్గవి లు వరుసగా ప్రథమ స్థానంలో నుంచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో గ్రాండ్ మాస్టర్ కెవి బాబురావు, ఇంటర్నేషనల్ రిపరీ సుదర్శన్ లు విజేతలకు చక్కటి శిక్షణ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఆనందరావు తో పాటు విజేతలను అభినందించారు.

Name*
Email*
Comment*