250 మట్టి వినాయక ప్రతిమల వితరణ

9/6/2024 8:29:16 PM

పొందూరు: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
స్ధానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో శుక్రవారం శ్రీకంచి కామాక్షి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో 250 వినాయక మట్టి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు.పర్యావరణ సమతుల్యతకు మట్టి బొమ్మలు దోహదం చేస్తాయని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహనరావు, పార్టీ నాయకులు అనకాపల్లి శ్రీరంగ నాయకులు,బాడాన శేషగిరిరావు,దండా రవికుమార్,ఆనెం పాపారావు,మద్దిల శ్రీనివాసరావు,కంచి కామాక్షి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సేవా సంఘానికి స్ధానికులు అభినందించారు.

Name*
Email*
Comment*