శిథిలా వ్యవస్థకు చేరిన బాలుర వసతిగృహం

9/6/2024 8:42:25 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మేజర్ పంచాయతీలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ శిథిల వ్యవస్థకు చేరింది. వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్ ప్రకటన తర్వాత స్పందించిన బీసీ హాస్టల్ వార్డెన్.

వార్డెన్  వివరణ.
ఈ పరిస్థితిలో ఉన్న  బిల్డింగులు సుమారుగా  50 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటున్నారు. వాళ్లు వర్షాకాలం అయినందువలన పెచ్చులు ఏ టైం లో నీ ఏ పిచ్చి పడుతుంది అనేది భయాందోళన గురి అవుతున్నారు. అలాగే  వర్షాకాలంలో బాగా ఇబ్బంది పడుతున్నారని, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ తెలిపారు. గతంలో 2022 నాడు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పుడు కూడా ఎటువంటి స్పందన లేదని వారు వివరణ ఇచ్చారు. ఇది పరిగణలో తీసుకొని ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని బీసీ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని కొత్త భవనానికి కొత్త భవనం నిర్మాణానికి కృషి చేస్తారని స్థానిక అధికారులతో మాట్లాడి ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Name*
Email*
Comment*