పర్యావరణహితంగా పార్వతీ పుత్రుడిని పూజిద్దాం- ఎంపీ కలిశెట్టి

9/6/2024 8:44:33 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
నెల్లిమర్ల రామతీర్ధాలు జంక్షన్ వద్ద మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ మానవ తప్పిదాలు ప్రకృతి వైపరిత్యాలై.. జీవరాసుల మనుగడ ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతోంది. సర్వం కాలుష్యమయమై పంచభూతాలు కన్నీరుపెడుతున్నాయి. ఇలాంటి సమయంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వినాయక చవితి పర్వదినాన హానికర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలను పూజిస్తే జలవనరులకు ఎంతో మేలు చేసిన వారవుతారు అని అన్నారు.

Name*
Email*
Comment*