మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం...ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

9/6/2024 8:52:46 PM

పాతపట్నం పంచాయతీ కార్యాలయం ఆవరణలో 1000 మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎం.జీ.ఆర్ 

నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే

పాతపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6.
నియోజకవర్గ ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి విగ్రహాలనే పూజించాలనే ఉద్దేశ్యంతో పాతపట్నం పంచాయతీ కార్యాలయం ఆవరణలో సుమారు 1000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన పాతపట్నం నియోజకవర్గం  శాసనసభ్యులు మామిడి గోవింద రావు ,అలాగే నియోజకవర్గ ప్రజలందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పైల బాబ్జి,సైలాడ సతీష్,సిర్ల ప్రభాకర రావు, జోగారావు,అక్కంద్ర సన్యాసి రావు, శాసనపురి బుల్లిబాబు,శివాల చిన్నయ్య,నిందిగాం ఆనందరావు, కరకవలస మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*