- నియోజకవర్గ భాజపా నాయకులు సిరిపురం తేజేశ్వరరావు
హిరమండలం: ఎక్స్ ప్రెస్ న్యూస్:
మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పాతపట్నం నియోజకవర్గ భాజపా నాయకులు సిరిపురం తేజేశ్వరరావు పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక మార్కెట్ లో ఆయన ఆద్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తన సొంత నిధులతో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మట్టి విగ్రహాలనే పూజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షులు బోయిన ధర్మారావు, నాయకులు డి. నీల మోహనరావు, పి. తిరుపతి, ఎ. ఉమా మహేశ్వర రావు, ఐ. నారాయణ రావు, పి. సూర్యనారాయణ, ఎన్. బుద్దిమంతుడు, ఆర్. ఢిల్లేశ్వరరావు, బి. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.