సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
సోంపేట పట్టణంలో శ్రీ శయన సామాజిక వర్గానికి చెందిన యువకులంతా కలిసి శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. శ్రీ శయన యూత్ నుండి లింగిబైరి, క్రాంతి కుమార్ కు కంచిలి గ్రామంలో గల శ్రీ కంచమ్మ తల్లి దేవాలయం ఆవరణలో వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కు సన్మానించారు. శ్రీ శయన యువత అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ ఇందులో వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తామని పలువురు యువకులు అన్నారు. రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు రావాలని సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీన ప్రదీప్ , దూగాన దివాకర్ ,దూగాన ,శశి ,బొమ్మిడి తేజ ,పొడుగు మణి , పిట్ట గోపాల్ ,బీన సురేష్ రెండు మండలాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.