వివాహిత మృతి

9/6/2024 8:59:42 PM

ఇచ్ఛాపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
ఇచ్చాపురం మండలంలో వివాహిత సుజాత మనస్థాపనతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.పోలీసులు,స్థానికులు చెప్పిన వివరాల మేరకు ధర్మపురం గ్రామానికి చెందిన రంగాల నూకమ్మతో టీ బరంపురం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన సుజాత తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. భర్త నూకయ్య విదేశాలలో వలస కూలీగా పనిచేస్తూ కుటుంబానికి పోషిస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం నూకయ్య, సుజాతల మధ్య వాగ్వాదం తలెత్తి అది ఘర్షణగా మారింది. దీంతో ఆమె మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావకం తాగి ఆత్మహత్య పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను ఒడిశా బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించే చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఘటన మంగళవారం జరగగా శుక్రవారం వెలుగులోకి వచ్చిందని  పోలీసులు తెలిపారు. దీనిపై రూరల్ ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Name*
Email*
Comment*